వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ బృందం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ నాలుగోరోజు కొనసాగుతోంది. ఉదయం కడప నుంచి పులివెందుల చేరుకున్న ఏడుగురు...

Published : 21 Jul 2020 12:35 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ నాలుగోరోజు కొనసాగుతోంది. ఉదయం కడప నుంచి పులివెందుల చేరుకున్న ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం విచారణ చేపట్టింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు .. వివేకా హత్యకేసు వివరాలు తెలుసుకున్నారు.

 2019 మార్చి 15న పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, సిట్‌ అధికారుల దర్యాప్తు నివేదికను పరిశీలించారు. ఇప్పటికే సిట్‌ అధికారులు పలువురు రాజకీయ ప్రముఖులు, వైకాపా, తెదేపా నాయకులు, అనుమానితులను కలిపి మొత్తం 1300 మందిని విచారించారు. ఆ విచారణ నివేదికను సీబీఐ అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు రెండో రోజు కూడా ఇంటిని పరిశీలిస్తున్నారు. వివేకా హత్యకు గురైన పడక, స్నానపు గదులను పరిశీలించారు. వివేకా భార్య సౌభాగ్యమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పులివెందుల మున్సిపాలిటీ సర్వేయర్‌ ద్వారా ఇంటి కొలతలు వేయించారు. ఇంటికి ఎన్ని గదులు, కిటికీలు ఉన్నాయని క్షుణ్నంగా పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని