Vizag Steel Plant: ఈనెల 28న విశాఖ బంద్‌: స్టీల్‌ ప్లాంట్‌ పోరాట కమిటీ పిలుపు

ఈనెల 28న విశాఖపట్నం నగర బంద్‌కు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ

Updated : 17 Mar 2022 12:24 IST

విశాఖపట్నం: ఈనెల 28న విశాఖపట్నం నగర బంద్‌కు స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరాహార దీక్షలు రేపటికి 400వ రోజుకు చేరుకోనున్నాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. బంద్‌కు మద్దతివ్వాలని ప్రజలు, రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. వందమంది ఎంపీల సంతకాలతో దిల్లీ వెళ్లి పోరాడతామని.. వారంరోజులపాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాలను కొసాగిస్తామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని