ఉద్ధృతమవుతోన్న ఉక్కు కార్మికుల పోరాటం 

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్మికుల

Updated : 10 Jul 2021 13:21 IST

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికుల చేస్తున్న పోరాటం రోజు రోజుకూ ఉద్ధృతమవుతోంది. ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్యలను నిరసిస్తూ భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని ఇందులో కార్మికులు డిమాండ్‌ చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించేలా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా లావాదేవీల, న్యాయ సలహాదారుల నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.ప్రైవేటీకరణ ప్రక్రియలో చట్టపరంగా చిక్కులు రాకుండా సలహాదారులు ఇచ్చే సూచనలు, సిఫార్సులు ఎంతో ముఖ్యం.
కీలకమైన వీరి నియామకానికి టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్లో ముందు నిలిచిన వారికి ప్రైవేటీకరణ ప్రక్రియ బాధ్యతలను అప్పగిస్తారు. ఒకవైపు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రంలో భాజపా మినహా ఇతర రాజకీయ పార్టీలు, కర్మాగార ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం ఇలా ముందడుగు వేస్తుండటంపై కార్మికులు నిరసనను తీవ్రతరం చేస్తున్నారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని