ఆమె ప్రతిభకు ఆ లోపం అడ్డు కాలేదు..
వినికిడి లోపం ఆమె ప్రతిభకు అడ్డు కాలేదు. ప్రతి భావోద్వేగాన్ని మనసుతో అర్థం చేసుకుని కుంచెతో కళాత్మక రూపం ఇస్తారు. నిశ్శబ్ద ప్రపంచంలో ఎన్నో సజీవ చిత్రాలకు ప్రాణం పోశారు విశాఖలో పుట్టిన సయీదా అలీ....
రివర్స్ పెయింటింగ్లో రాణిస్తున్న సయీదా అలీ
విశాఖపట్నం: వినికిడి లోపం ఆమె ప్రతిభకు అడ్డు కాలేదు. ప్రతి భావోద్వేగాన్ని మనసుతో అర్థం చేసుకుని కుంచెతో కళాత్మక రూపం ఇస్తారు. నిశ్శబ్ద ప్రపంచంలో ఎన్నో సజీవ చిత్రాలకు ప్రాణం పోశారు విశాఖలో పుట్టిన సయీదా అలీ. తాజాగా సంక్రాంతి సంప్రదాయంలో భాగమైన గంగిరెద్దులు, కోడి పుంజుల చిత్రాలకు వర్ణాలద్దారు. విశాఖ నుంచి చిత్రకళా ప్రస్థానాన్ని ప్రారంభించి దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. సయీదా అలీ ఆరో ఏటనే చిత్ర కళలో అడుగుపెట్టారు. ఆమెకు వినిపించదు. మొదట్లో కొద్దిగా ఉన్న సమస్య ఆ తర్వాత పూర్తిగా వ్యాపించింది. అయినా ఆమె కళాసృష్టి ఆగలేదు. రెట్టింపు ఉత్సాహంతో చిత్రకళకు మరింత వన్నెలద్దారు. అద్దంపై చిత్రకళను ఆవిష్కరించే రివర్స్ పెయింటింగ్పై పట్టు సాధించారు.
మనసుకు ఏమనిపిస్తే చిత్రకళ ద్వారా ఆవిష్కరించే సయీదా.. సంక్రాంతి పండగలో కీలకమైన గంగిరెద్దుల చిత్రాలతో ఓ సిరీస్నే రూపొందించారు. బసవన్నల రాజసాన్ని, వాటి విన్యాసాలను కళ్లకు కట్టినట్లు దించేశారు. ఆంధ్రా వర్సిటీ ఫైనాన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సయీదా హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. వివాహ అనంతరం కుటుంబానికి సమయం వెచ్చిస్తూనే తనకు ఇష్టమైన చిత్ర కళను వదులుకోలేదు. కెనడా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేసియా, సింగపూర్ ఇలా ఎక్కడ నివాసముంటే అక్కడే తన రంగుల ప్రపంచాన్ని పరిచయం చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. తనలోని లోపం తనకెప్పుడూ అడ్డంకి కాలేదంటున్నారు సయీదా. కేజీ సుబ్రమణ్యన్, కె.లక్షణ గౌడ వంటి ప్రముఖ చిత్రకారుల ప్రశంసలే తనకు అవార్డులని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి...
పట్టుదలే పెట్టుబడిగా.. వైకల్యాన్ని అధిగమిస్తూ..
నాలుగు భాషలు.. ఒకటి సరిగ్గా మరొకటి రివర్స్లో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు