‘భారత్ ధూమపాన రహిత దేశం కావాలి’
భారతదేశాన్ని ధూమపాన రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని..
వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన
దిల్లీ: భారతదేశాన్ని ధూమపాన రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను ది సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రాడక్ట్స్ చట్టం-2003 (సీవోటీపీఏ-2003)లో భాగంగా ధూమపాన ప్రాంతాల(స్మోకింగ్ జోన్స్)ను అనుమతించే ప్రస్తుత నిబంధనలను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు, విమానాశ్రయాలు వంటి కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేందుకు ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగదారులు ఉన్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ ఉందని సంస్థ పేర్కొంది. వీరిలో ప్రతి సంవత్సరం కనీసం 1.2 మిలియన్లు పొగాకు సంబంధిత వ్యాధుల బారినపడి మరణిస్తున్నారని వెల్లడించింది. ధూమపానం చేసేవారు సామాజికంగా దూరం లేదా ముసుగులు ధరించలేరు కాబట్టి వారికి సమీపంలో ఉన్నవారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతోన్న బాధితులు మరిన్ని సమస్యలు ఎదుర్కొనేందుకు ఆస్కారం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పొగాకు నియంత్రణ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.
వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కమ్యూనికేషన్ కన్సల్టెంట్ నాగ శిరీష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్