Vontimitta: ఒంటిమిట్ట రాములోరి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి కోదండ రామాలయాన్ని శోభాయమానంగా

Updated : 15 Apr 2022 20:58 IST

ఒంటిమిట్ట: వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. సీతారామచంద్రుల కల్యాణ మహోత్సవానికి కోదండ రామాలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్.. స్వామివారికి పట్టు పస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఒంటిమిట్టకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు పట్టువస్త్రాలు పంపించారు. వారి తరఫున రాజ్‌భవన్‌ అధికారులు శ్రీరామచంద్రస్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని