UN: మహమ్మారికి త్వరగా ముగింపు పలకాలి: ఐరాస చీఫ్
40 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలను బలిగొన్న కొవిడ్ మహమ్మారిని అరికట్టే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది.....
జెనీవా: 40 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలను బలిగొన్న కొవిడ్ మహమ్మారిని అరికట్టే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. మహమ్మారిని త్వరితగతిన అంతం చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనేక దేశాలు వెనుకబడ్డాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సోమవారం జరిగిన 76వ ఐరాస సర్వసభ్య సమావేశంలో గుటెర్రస్ మాట్లాడుతూ.. ‘మునుపెన్నడూ లేనివిధంగా ప్రపంచం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, పలు వివాదాలు మొదలు... కొవిడ్ కారణంగా సుస్థిర అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాం. ఈ మహమ్మారికి త్వరగా ముగింపు పలకాలి. కొవిడ్ను అరికట్టడంతో నెమ్మదిగా ఉన్నాం. అసమానతలను అధిగమించాలి. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రపంచంలోని 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా టీకా ఉత్పత్తిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఐరాస చీఫ్ వెల్లడించారు.
కరోనాతోపాటు మరో నాలుగు అంశాలపైనా గుటెర్రస్ మాట్లాడారు. సంక్షోభంలో ఉన్న దేశాలు దాని నుంచి బయటపడేందుకు కృషి చేయాలని సూచించారు. అలా చేస్తేనే రానున్న రోజుల్లో పేదరికాన్ని నివారించగలమని పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలు, బాలికలకు హక్కులు కల్పించాలని కోరారు. లింగసమానత్వం లేకపోతే ఎలాంటి లక్ష్యాలను చేరుకోలేమన్నారు. వాతావరణాన్ని కాపాడుకునేందుకు అసమాన కృషి చేయాల్సిన అవసరం ఉందని.. 2050 నాటికి కాలుష్య ఉద్గారాలను పూర్తిగా తగ్గించేందుకు విశేష కృషి చేయాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!