Heart Attack: గుండెపోటు వచ్చినపుడు ఏం చేయాలంటే..!
గుండెపోటు వచ్చినపుడు ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే అంత మంచిది. లేకపోతే గుండె కండరాలు చచ్చుబడిపోతాయి.
ఇంటర్నెట్ డెస్క్: గుండెపోటు రావడమనే మాట వింటేనే హడలిపోతాం. అయితే.. నిజంగా వస్తే ఏం చేయాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి. తినే ఆహారంతో పాటు చేయాల్సిన వ్యాయామంపై దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. గుండెపోటు వచ్చినట్టు అనుమానం వస్తే కంగారు పడకుండా సకాలంలో ఆసుపత్రికి వెళ్లడానికి సిద్ధం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాలపైకి వచ్చే ఈ సమస్యకు వేగంగా స్పందించాలని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రమేశ్ గూడపాటి పేర్కొన్నారు.
ఎలా ఉంటుందంటే...
ఏదో ఒక రక్తనాళం ఆకస్మాత్తుగా మూసుకొని పోవడంతో గుండెపోటు వస్తుంది. దానితో గుండెలో ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోతుంది. గుండెపోటు వచ్చినపుడు ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే అంత మంచిది. లేకపోతే గుండె కండరాలు చచ్చుబడిపోతాయి.
లక్షణాలు ఇలా...
* ఛాతీలో నొప్పి, చేయి లాగినట్టు ఉండటం, దవడనొప్పి ఉంటుంది. గుండెలో మంటగా అనిపిస్తుంది. దడ, ఆయాసం వస్తుంది. వీటితో పాటు బాగా చెమట పడుతుంది. వికారంగా ఉంటుంది. వాంతులు కూడా అవుతాయి. అందరికీ ఒకే రకమైన లక్షణాలుండవు.
ఏం చేయాలంటే..
ఏదైనా పని చేస్తున్నపుడు గుండెపోటు వస్తే వెంటనే చేస్తున్న పని ఆపేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. అనుమానం ఉన్నపుడు సొంతంగా వాహనాన్ని నడుపుకొంటూ వెళ్లొద్దు. వీలైతే 108కి ఫోన్ చేయాలి. లేదంటే స్నేహితులకు సమాచారం ఇవ్వాలి. గుండె సమస్య ఉన్నవారయితే సార్బిట్రేట్ ట్యాబ్లెట్ను నాలుక కింద పెట్టుకోవచ్చు. అనుమానం ఉన్న వారు వాడితే బీపీ తగ్గిపోయి పడిపోవచ్చు. సీపీఆర్ను గుండె ఆగిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నపుడు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!