IVF: ఐవీఎఫ్ విఫలమయితే ఎలా...! ఇక సంతానం కష్టమేనా..?
అన్యోన్యంగా ఉండే ఆ దంపతులకు నాలుగేళ్లయినా పిల్లలు లేరు. భార్యాభర్తల్లో ఏ సమస్య లేదు. ఎందుకో పిల్లలు కలగడం లేదు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కడం లేదు..ఇలా తెలిసిన వాళ్లంతా అనుకుంటారు. నిజమే ఇలాంటి సమస్యకు చివరి ప్రయత్నం ఐవీఎఫ్ విధానం. ఇందులో పిల్లలు కాకపోతే ఎలా..?
ఇంటర్నెట్ డెస్క్: అన్యోన్యంగా ఉండే ఆ దంపతులకు నాలుగేళ్లయినా పిల్లలు లేరు. భార్యాభర్తల్లో ఏ సమస్య లేదు. ఎందుకో పిల్లలు కలగడం లేదు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కడం లేదు..ఇలా తెలిసిన వాళ్లంతా అనుకుంటారు. నిజమే ఇలాంటి సమస్యకు చివరి ప్రయత్నం ఐవీఎఫ్ విధానం. ఇందులో పిల్లలు కాకపోతే ఎలా..? తదుపరి అవకాశం ఏదైనా ఉందా..? ఇలాంటి ప్రశ్నలకు ఇన్పెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ శ్రీదుర్గ వివరాలను అందించారు.
విఫలం తర్వాత సఫలం సాధ్యం కాదా..: కొందరికి అనుకోకుండా ఐవీఎఫ్ చేసినా విఫలం అవుతుంది. అయినా కూడా నిరుత్సాహ పడాల్సిన పని లేదు. అండం, వీర్యకణాలు బాగున్నట్లయితే రెండోసారి గర్భం దాల్చడానికి అవకాశం ఉంది. మొదటి దశలోనే అన్ని రకాల సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్న తర్వాతే ఐవీఎఫ్కు వెళ్తాం..అందుకే రెండోసారి ప్రయత్నిద్దామని చెబుతాం. ఇలా కాకపోయినా సమీప బంధువులతో సరోగసీ పద్ధతిలో పిల్లలను కనొచ్చు. కొంతమందికి జెనెటిక్స్ సమస్యతో కూడా గర్భస్రావం అవుతుంది. అలాంటి వారికి ఎంబ్రియోలో ఇబ్బందులున్నాయోనని బయాస్పీ చేస్తాం.
అండాల ప్రిజర్వు ఎందుకు..: ఇటీవల కాలంలో ఉద్యోగం, కుటుంబ పరిస్థితుల కారణంగా పిల్లలను తొందరగా కనడం లేదు. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వాళ్ల ఉద్యోగ విధుల రీత్యా ఆలస్యంగా పిల్లలను కనాలనుకుంటున్నారు. వీళ్ల కోసమే అండం. వీర్యకణాలను ప్రిజర్వ్ చేస్తున్నారు. కొంతమంది మహిళలకు క్యాన్సర్ వస్తే ఓవరీస్ తీసే అవకాశం ఉంది. ఎంబ్రియో గ్లూ వాడాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవు. వైద్యులు వాటిని సూచించడం కూడా మంచిది కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్