IBS: పేగుల్లో ‘గడబిడ’కు కళ్లెం... ఏం తినాలంటే?
పేగుల్లో గడబిడ.. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (ఐబీఎస్). ఇదో దీర్ఘకాల సమస్య. దీని బారినపడితే కడుపునొప్పి,
పేగుల్లో గడబిడ.. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (ఐబీఎస్). ఇదో దీర్ఘకాల సమస్య. దీని బారినపడితే కడుపునొప్పి, కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం వంటివి తరచుగా వేధిస్తుంటాయి. ఇలాంటివారు ఆహారం విషయంలో.. ముఖ్యంగా అంతగా జీర్ణం కాని పిండి పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇలాంటి జీర్ణం కాని పిండి పదార్థాలు పేగుల్లోకి చేరినప్పుడు అక్కడి బ్యాక్టీరియా వాటితో రసాయనిక చర్యలు మొదలెడుతుంది. దీంతో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఐబీఎస్ బాధితులు జీర్ణం కాని పిండి పదార్థాలను పరిమితంగా తీసుకోవటం మేలు. అలాంటి పదార్థాలేంటో, వాటికి ప్రత్యామ్నాయాలేంటో చూద్దాం.
పాలు: కొందరికి పాలలోని లాక్టోజ్ను విడగొట్టే లాక్టేజ్ స్థాయులు తక్కువగా ఉంటాయి. ఇలాంటివారికి పాలతో పాటు ఛీజ్ వంటి పాల ఉత్పత్తులు అంతగా పడవు. వీటిని కాస్త ఎక్కువగా తినగానే గ్యాస్ ఉత్పత్తి అయ్యి కడుపునొప్పి వంటివి బయలుదేరతాయి. కాబట్టి ఐబీఎస్ బాధితులు పాలు, పాల ఉత్పత్తులను పరిమితంగా తీసుకోవాలి. వీటికి బదులుగా సోయా పాల వంటివి తీసుకోవచ్చు.
పండ్లు: ఐబీఎస్ గలవారికి ఫ్రక్టోజ్ రకం చక్కెరతో లక్షణాలు పెరుగుతాయి. యాపిళ్లు, పుచ్చకాయ, ఎండు ఫలాల వంటి వాటిల్లో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఫ్రక్టోజ్ తక్కువగా ఉండే అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, స్ట్రాబెర్రీ వంటివి తీసుకోవచ్చు.
కూరగాయలు: కడుపులో గ్యాస్ ఉత్పత్తికి దోహదం చేసే క్యాబేజీ, గోబీపువ్వు, ఉల్లిగడ్డ వంటివి కడుపులో గడబిడకు దారితీస్తాయి. వీటికి బదులు వంకాయ, పాలకూర, క్యారట్, చిలగడదుంప, కందగడ్డ వంటివి తినటం మంచిది.
పప్పులు: బఠాణీలు, శనగలు, కందులు, సోయాబీన్స్ వంటి వాటిల్లో జీర్ణం కాని చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఐబీఎస్ లక్షణాలు పెరిగేలా చేస్తాయి. పప్పులకు ప్రత్యామ్నాయం లేకపోవచ్చు గానీ వీటికి బదులుగా ఓట్స్, చిరుధాన్యాలు, క్వినోవా, కర్రపెండలం వంటివి తీసుకోవచ్చు.
వీటికి తోడు కొవ్వు తక్కువగా గల ఆహారం తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం.. మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండటమూ మేలు చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి