Work from home: ‘ఆఫీసు వద్దు.. వర్క్ ఫ్రమ్ హోమే ముద్దు’.. కంపెనీలకు కొత్త బెడద!
కరోనా ముప్పు అప్పుడే ముగిసిపోలేదు. అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కష్టాలు తప్పవని కేంద్రంతో పాటు పలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా ముప్పు అప్పుడే ముగిసిపోలేదు. అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కష్టాలు తప్పవని కేంద్రంతో పాటు పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నీతి ఆయోగ్, ఎస్బీఐ లాంటి సంస్థల అధ్యయనాలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. డెల్టా వేరియంట్ విరుచుకుపడితే సెకండ్ వేవ్ నాటి రోజులు పునరావృతమయ్యే ప్రమాదముందనీ అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ సంస్థలు వర్క్ ఎట్ ఆఫీస్ వైపు మొగ్గుచూపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వ్యాక్సినేషన్ రక్షణ ఉందని సంస్థలు చెబుతున్నా వాటితో పూర్తి స్థాయి భద్రత ఉంటుందా అన్నదీ అర్థం కాకుండా ఉంది. అందుకే ఆఫీస్లకు తిరిగి వెళ్లటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వర్క్ ఫ్రం ఇవ్వరా.. అయితే వెళ్లిపోతాం..
ఆఫీసుకు వెళ్లి పనిచేయడానికి ఉద్యోగులు సుముఖత చూపడం లేదు. కంపెనీలు బలవంతపు ఆదేశాలు జారీ చేస్తే సంస్థను వీడడానికి సిద్ధపడుతున్నారు. అయితే పలువురు ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ఫ్రం హోం పట్ల ఆసక్తి చూపుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. లండన్కు చెందిన ప్రైజ్ వాటర్ హైజ్ కూపర్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. వర్క్ఫ్రం హోంలో ఉన్న 41శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయడానికి అంగీకరించలేదని ఈ నివేదికలో తేలింది. జనవరిలో ఈ కంపెనీ నిర్వహించిన సర్వేలో 29 శాతం మాత్రమే ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించగా ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది.
వర్క్ ఫ్రం హోంకే మొగ్గు
భారత్కు చెందిన ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ ఆగస్టు రెండో వారంలో లక్షన్నర మంది ఉద్యోగుల అభిప్రాయాలతో ఓ సర్వే చేపట్టింది. అందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ఫ్రం హోంకి మొగ్గుచూపారు. ఒత్తిడిలో ఉన్నా తాము రిమోట్ వర్క్తో అన్నివిధాలుగా సౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తే కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ ఉండాలి. ఈ క్రమంలో నిర్వహణ భారం పెరగడంతో పాటు ప్రధానంగా ఆఫీస్ స్పేస్ సమస్యగామారే అవకాశాలున్నాయి. అందుకే అక్టోబర్ వరకు వేచి చూసి నవంబర్ లేదా డిసెంబర్ నుంచి ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు కొన్ని సంస్థలు సిద్ధమవుతున్నాయి. చిన్న కంపెనీలైతే ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తున్నాయి.
నగరానికి దూరంగా 40 శాతం ఉద్యోగులు
ఇంటి నుంచి పనిచేస్తున్నవాళ్లు చాలా మంది సొంత ఊళ్లల్లో ఉంటున్నారు. హైదరాబాద్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు 40 శాతం మంది నగరానికి దూరంగానే ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి అద్దె ఇళ్లు వెతుక్కోవడానికి, వసతి గృహాల్లో చేరడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం కార్యాలయాలకు 10 శాతం మంది ఉద్యోగులు వస్తున్నారు. కంపెనీలు వర్క్ ఎట్ ఆఫీసుపై ఒత్తిడి తీసుకువస్తే అనుభవం ఉన్న ఉద్యోగులు వేరే కంపెనీకి మారిపోతున్నారు. ఫలితంగా ఐటీ సంస్థలో అట్రిషన్ రేటు పెరుగుతుంది. ఒక సంస్థ నుంచి ఎంత మంది ఉద్యోగులు వెళ్లిపోతున్నారన్న అంశం అధారంగా ఈ అట్రిషన్ రేటు నిర్ణయిస్తారు. కొత్త ప్రాజెక్టులు వచ్చే క్రమంలో మానవవనరులు సరిపోని కారణంగా పలు సంస్థలు వాటిని వదిలేస్తున్నాయి. ఓ కంపెనీని వీడిన ఉద్యోగికి వర్క్ఫ్రం హోం అవకాశం కల్పిస్తామంటూ తమవైపు లాగేస్తున్నాయి మరికొన్ని సంస్థలు. ఈ సవాళ్లను అధిగమిచేందుకు కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అమెరికా కేంద్రంగా నడిచే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ సంస్థలకు డెల్టా వేరియంట్ గుబులు పట్టుకుంది. అందుకే జనవరి వరకూ వర్క్ఫ్రం హోం కొనసాగించవచ్చని ఉద్యోగులకు కబురు పంపాయి. ఏదేమైనా పూర్తిస్థాయిలో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడం యాజమాన్యాలకు సవాల్గానే మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Heart attack: పెళ్లి రోజే.. గుండెపోటుతో నవదంపతుల మృతి
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
-
India News
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
-
India News
Odisha train Tragedy: లోకో పైలట్ తప్పిదం లేదు..! ‘సిగ్నల్ వ్యవస్థ’ను ఎవరు ట్యాంపర్ చేశారు..?
-
General News
CM KCR: చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.. ఇదే పట్టుదలతో ముందుకు సాగుదాం: కేసీఆర్