పనిలో మునిగాడని భర్తను కిడ్నాప్ చేసింది
కుటుంబాన్ని పోషించడానికి, జీవితంలో ఎదగడానికి సాధారణంగా మగాళ్లు ఉద్యోగం చేస్తుంటారు. ఎంతో కష్టపడుతుంటారు. అయితే, అంతగా కష్టపడుతున్న భర్తను చూసి.....
ఇంటర్నెట్ డెస్క్: కుటుంబాన్ని పోషించడానికి, జీవితంలో ఎదగడానికి సాధారణంగా మగాళ్లు ఉద్యోగం చేస్తుంటారు. ఎంతో కష్టపడుతుంటారు. అయితే, అంతగా కష్టపడుతున్న భర్తను చూసి ఏ భార్య అయినా గర్వపడుతుంది. అయితే, ఈవిడ గారు మాత్రం తన భర్త రాత్రిపగలూ మరీ ఎక్కువగా కష్టపడుతున్నాడని ఏకంగా అతడిని కిడ్నాప్ చేసేసింది. ఆ తర్వాత జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. గత నెలలో ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం జపాన్లో వైరల్గా మారింది.
జపాన్కి చెందిన ఓ మహిళ తన భర్త పనిలో మునిగిపోయి.. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడని ఆవేదన చెందింది. సాధారణంగా అయితే భర్త ఇంటికి రాగానే భార్య వేడి నీళ్లు పెట్టి, స్నానం చేశాక సేదతీరమని చెబుతుంది. కానీ ఆమె తన భర్తను కిడ్నాప్ చేసింది. రాత్రి షిఫ్టులో ఉన్న తన భర్త ఉదయం బయటికి వచ్చే సమయానికి అతడి ఆఫీస్ ముందు నిల్చుంది. అతడు బయటకు రాగానే రైల్వేస్టేషన్కు లాక్కెళ్లింది. ఎక్కడికి? ఎందుకు? అని తన భర్త అడుగుతున్నా సమాధానం ఇవ్వకుండా కొన్ని గంటలపాటు రైలు, బస్సు ప్రయాణం చేసి నగరాలు దాటి.. మారుమూల పర్వతప్రాంతమైన ఇజు పెనిన్సులాకు తీసుకెళ్లింది.
అక్కడ ఒక ప్రాచీన సంప్రదాయ హోటల్లో దిగిన తర్వాత భర్తను ఓపెన్ ఎయిర్ బాత్ చేయమని చెప్పిందట. ఆ తర్వాత అతడికి గదిలోకి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకోమందట. దీంతో రాత్రంతా విధుల్లో.. ఉదయం కొన్ని గంటలపాటు ప్రయాణంలో అలిసిపోయిన అతడు హాయిగా నిద్రపోయాడట. తన భర్త అలా ఆదమరిచి నిద్రపోతున్న ఫొటోను కూడా ఆమె పోస్టు చేసింది. కేవలం తన భర్త విశ్రాంతి తీసుకోవడం కోసమే కిడ్నాప్ చేసి ఈ ప్రశాంతమైన ప్రాంతానికి తీసుకెళ్లానని చెబుతూ.. ఆ అనుభవాలను సోషల్మీడియాలో వెల్లడించింది. ఎలాగైతేనేం తన కిడ్నాప్ ప్లాన్ విజయవంతంగా పూర్తయ్యిందంటూ రాసుకొచ్చింది. భలే భార్య కదూ..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు