DTH Recharge: డీటీహెచ్ రీఛార్జి చేయలేదని విడాకులు కోరిన భార్య!
డీటీహెచ్ రీఛార్జి చేయలేదన్న కారణంతో భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు.. రీఛార్జి చేయలేని భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: నగలు కొనలేదనో.. బయటకు తీసుకెళ్లలేదనో అలిగే భార్యలను చూసుంటారు. తాగొచ్చి హింసిస్తున్నాడనో.. కొట్టాడనో కారణంతో ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్లేవారి గురించి వినే ఉంటారు. కానీ, ఇక్కడో ఇల్లాలు డీటీహెచ్ రీఛార్జి చేయలేదన్న కారణంతో భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాదు.. రీఛార్జి చేయలేని భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జరిగింది.
ఇటీవల వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. టీవీ లేకుండా ఒక్క క్షణం లేకుండా ఉండలేని ఆ భార్య డీటీహెచ్ రీఛార్జి అయిపోవడంతో భర్తను రీఛార్జి చేయమని కోరింది. అయితే, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని సమాధానం చెప్పాడు భర్త. ఇదే అతగాడు చేసిన తప్పు. వెంటనే ఇల్లొదిలి ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్లిపోయింది. వెళ్లే ముందు ‘టీవీ లేకుంటే పెళ్లామూ ఉండదు’ అంటూ రైమింగ్లో ఓ డైలాగ్ చెప్పి మరీ వెళ్లిపోయింది. అప్పటికీ అతగాడు సాయంత్రం పనికెళ్లి వచ్చి రీఛార్జి చేయిస్తానని మాటిచ్చినా ఆమె వినలేదు. తీరా పుట్టింటికి వెళ్లాక తనకు విడాకులు కావాలని పట్టుపట్టింది.
ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో వారు సైతం కంగుతిన్నారు. ‘ఇదేం కేసురా బాబూ’ అనుకుంటూనే విధి నిర్వహణలో భాగంగానే భార్యభర్తలను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. జీవితంలో ఇలాంటివి సహజం అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. కొన్ని రోజుల కౌన్సెలింగ్ తర్వాత భార్యాభర్తలు మళ్లీ ఒక్కటయ్యారు. ఇంత జరిగాక రీఛార్జి చేశాడో లేదో ఇంతకీ ఈ బాసు!?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు