భర్తలను ఎత్తుకొని భార్యల పరుగులు..

ఓ స్థానిక పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ భర్తలను వీపుపై మోస్తూ 100 మీటర్ల పరుగు పందెంలో సత్తాచాటారు....

Published : 10 Mar 2021 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడ, మగ అనే ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతిఒక్కరు లింగ సమానత్వం గురించే మాట్లాడతారు. ఈ నేపథ్యంలోనే ఆడవాళ్లు మగవాళ్లకు ఏమాత్రం తక్కువకాదు అని పేర్కొంటూ నేపాల్‌లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఓ స్థానిక పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ భర్తలను వీపుపై మోస్తూ 100 మీటర్ల పరుగు పందెంలో సత్తాచాటారు. 16 జంటలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఆడవాళ్లు ఎవరికీ తక్కువ కాదు అనే నినాదంతో నిర్వహించిన ఈ పోటీల్లో గెలిచినవారితోపాటు ప్రతి జంటకు ధ్రువపత్రాలు అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని