Madhya Pradesh: చెట్టుపై నుంచి కురిసిన నోట్ల వర్షం.. ఏం జరిగిందంటే?
చెట్టుపై నుంచి నోట్ల వర్షం కురవడం ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే.. అయితే ఇందుకు కారణం ఓ వానరం.....
భోపాల్: చెట్టుపై నుంచి నోట్ల వర్షం కురవడం ఏమిటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే.. అయితే ఇందుకు కారణం ఓ వానరం. ఆటోరిక్షా నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిన ఓ కోతి చెట్టుపైకి ఎక్కి అక్కడి నుంచి వాటిని వెదజల్లింది. దీంతో ఆ డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. కటావ్ఘట్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అలీ అనే వ్యక్తి లక్ష రూపాయలను టవల్లో చుట్టుకొని ఆటో రిక్షాలలో ప్రయాణిస్తున్నాడు. అతడి వెంట మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు.
అయితే ఇరుకు రోడ్లతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిజ్ జామ్ ఏర్పడింది. అసలేం జరిగిందో చూద్దామని ఆ ముగ్గురు ఆటోరిక్షా కిందకు దిగడంతో.. ఎక్కడి నుంచో అకస్మాత్తుగా వచ్చిన ఓ కోతి ఆటోలో ఉన్న డబ్బుల మూటను ఎత్తుకుపోయింది. అక్కడే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కింది. తినుబండారాలుగా భావించి ఆ మూటను ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. చెట్టు పైకి ఎక్కిన తర్వాత ఆ టవల్ను దులిపింది. దీంతో అందులోని డబ్బులు మొత్తం కిందపడిపోయాయి. డబ్బులు చెల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన కొంతమంది తమ చేతివాటం చూపించారు. దీంతో రూ.లక్షకు గానూ కేవలం రూ.56వేలను మాత్రమే బాధితుడు సేకరించుకోగలిగాడు. దాదాపు రూ.44వేలు నష్టపోవడంతో అతడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.