23ఏళ్లుగా శాండ్విచ్లనే తిన్న యువతి.. మారిందిలా..!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన విటమిన్లు, పోషకాలు అని ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యానికి గురవుతాము.
ఇంటర్నెట్ డెస్క్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యానికి గురవుతాం. ఇందంతా ఇప్పుడెందుకు అనుకోకండి.. ఇంగ్లాండ్కు చెందిన ఓ యువతి దాదాపు 23 ఏళ్ల నుంచి శాండ్ విచ్, చిప్స్ మాత్రమే తింటోంది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఓ అరుదైన వ్యాధి వచ్చిందని ఇలానే తింటూ ఉంటే ఆమె బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. అసలు ఎవరు ఆ యువతి.. ఏంటి ఆ కథ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..
ఇంగ్లాండ్ చెందిన జియో శాడ్లర్ అనే యువతి 23 ఏళ్లుగా కేవలం శాండ్విచ్లు, కరకరలాడే చిప్స్ మాత్రమే తింటోంది. ఆమెకు రెండు, మూడేళ్ల వయసున్నప్పుడు ఇవి తినడం అలవాటు అయింది. తల్లిదండ్రులు కూడా లంచ్ బాక్స్లో వీటినే పెట్టి పంపేవారు. క్రమంగా ఆమెకు ఇతర ఆహార పదార్థాలపై ఇష్టం పోయింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ‘మల్టిపుల్ స్లెరోసిస్’ అనే వ్యాధి సోకిందని జీవితాంతం చికిత్స తీసుకోవాల్సిందేనని తెలిపారు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను హిప్నాథెరపిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. కౌన్సిలింగ్ అనంతరం పండ్లు, కూరగాయలు తినడం ఆరంభించింది. తొలిసారి భోజనం చేసిన ఆమె తన అనుభూతిని పంచుకుంది. ‘స్ట్రాబెరీలు ఇంత రుచిగా ఉంటాయని అనుకోలేదు. మిగతా ఆహారపదార్థాలను కూడా తినడానికి నేను ఎదురుచూస్తున్నాను. వచ్చే ఏడాది జరగనున్న నా పెళ్లిలో నేను వింధుభోజనం చేస్తాను’ అని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం