Ap news: అత్యాచార బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
తాడేపల్లి అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఏపీ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు....
అమరావతి: తాడేపల్లి అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని ఏపీ మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ.50వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ‘‘ ఇద్దరు దుండగులు ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది. బాధితురాలితోపాటు ఆమె కాబోయే భర్తను కొట్టి బంగారు ఆభరణాలు లాక్కెళ్లిపోయారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 50 శాతం ఆధారాలు సేకరించాం. పోలీసు దర్యాప్తు కూడా త్వరితగతిన సాగుతోంది’’ వనిత అన్నారు.
తాడేపల్లి ఘటన హేయమైన చర్య అని హోం మంత్రి సుచరిత అన్నారు. కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆమె తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 15 లక్షల మంది ఇప్పటివరకు దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు సుచరిత వివరించారు ‘‘ బ్లేడ్లతో బెదిరించి వారి వద్ద నుంచి ఫోన్లు లాక్కున్నారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టం. ఇలాంటి ఘటనలపై త్వరిగత గతిన దర్యాప్తు జరిగేలా రాష్ట్రంలో మూడు చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాం .ఇప్పటికే ఈ ల్యాబుల్లో సిబ్బందిని నియామిస్తున్నాం.తాడేపల్లి ఘటన జరిగిన ప్రాంతంలో ఇటీవల 5 నేరాలు జరిగాయి. అలాంటివి జరగకుండా నిఘా, భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం’’ అని సుచరిత అన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో.. సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్లో కాబోయే భర్త కాళ్లు చేతులను కట్టేసి.. కదిలితే పీక కోసేస్తామంటూ బెదిరించి అతడి కళ్లెదుటే ఓ యువతిపై ఇద్దరు దుండగులు అత్యంత క్రూరంగా అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే. బాధితురాలి ముఖాన్ని ఇసుకలో కుక్కేసి, ఊపిరాడనివ్వకుండా చేసి పాశవికంగా అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. సీఎం అధికారిక నివాసానికి కేవలం కిలోమీటరున్నద దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM