Bandi sanjay: కవితపై వ్యాఖ్యలు.. బండి సంజయ్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు

భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Updated : 13 Mar 2023 18:17 IST

హైదరాబాద్‌:  భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha )పై అనుచిత వ్యాఖ్యల కేసులో  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) కి రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.  అతడి వ్యాఖ్యలను వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన కమిషన్‌  కేసును సుమోటోగా విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 15న ఉదయం 11గంటలకు కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ నోటీసులు అందజేసిన సందర్భంగా  సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే భారాస శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. వివిధ పోలీస్‌ స్టేషన్లలో బండికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని