longest non stop flight: 19 గంటల నాన్స్టాప్ జర్నీ.. ఈ విమానంలో ఫీచర్లేంటో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం నడిచే నాన్స్టాప్ కమర్షియల్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు క్వాంటాస్ ఎయిర్లైన్స్ ప్రకటించింది........
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్లైన్స్ సరికొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం నడిచే నాన్స్టాప్ కమర్షియల్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. 2025 చివరి నాటికి వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. సిడ్నీ నుంచి లండన్కు వీటిని నడుపనున్నామని, ఈ ప్రయాణం ఏకధాటిగా 19.19 గంటలపాటు ఉంటుందని పేర్కొంది. ప్రయాణం ఎక్కువ దూరం ఉండటం వల్ల ఈ విమానాల్లో ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు క్వాంటాస్ ఎయిర్లైన్స్ తెలిపింది.
ఈ విమాన సర్వీసుల కోసం ఐదేళ్ల నుంచి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. ‘ప్రాజెక్ట్ సన్రైజ్’ పేరుతో 12 ఎయిర్బస్ A350-1000 విమానాలను ఆర్డర్ చేసినట్లు ఎయిర్లైన్స్ పేర్కొంది. 2025 చివరినాటికి సిడ్నీ నుంచి లండన్తోపాటు న్యూయార్క్కు సర్వీసులు ప్రారంభిస్తామని, ఆ తర్వాత మెల్బోర్న్ నుంచి కూడా నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రయాణాన్ని ఒకే విమానంలో చేపట్టేందుకు ఏళ్ల నుంచి ప్రణాళికలు రూపొందిస్తున్నామని క్వాంటాస్ అధ్యక్షుడు అలన్ జోయిస్ పేర్కొన్నారు.
సిడ్నీ-లండన్ మధ్య 17,800 కి.మీ. (11,030 మైళ్లు) మార్గంలో ఒకే విమానంలో ప్రయాణం సాగించేలా క్వాంటాస్ 2019 నుంచే పరీక్షలు చేపట్టింది. కాగా ఇందుకే 19 గంటల 19 నిమిషాల సమయం పట్టింది. న్యూయార్క్-సిడ్నీ మధ్య 16,200 కిలోమీటర్ల (10,200 మైళ్ళు) దూరాన్ని కవర్ చేసేందుకు టెస్ట్ ఫ్లైట్ 19 గంటల సమయాన్ని తీసుకుంది. క్వాంటాస్ ఇప్పటికే 14,498 కి.మీ. పెర్త్-లండన్ ప్రయాణాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు 17 గంటల సమయం పడుతోంది.
సుదూర ప్రయాణం నేపథ్యంలో A350 విమానాల్లో ప్రత్యేక క్యాబిన్ను తయారు చేయనున్నారు. మొత్తం 238 మంది ప్రయాణికులకు సరిపడా ఈ విమానాల్లో సీటింగ్ కెపాసిటీ ఉండనుంది. ఫస్ట్ క్లాస్ సూట్లో ప్రత్యేక బెడ్, వాలు కుర్చీ, వార్డ్రోబ్ను ఏర్పాటు చేయనుండటం విశేషం. 40 A321 XLR సహా A220 విమానాలను కూడా ఆర్డర్ చేస్తున్నట్లు క్వాంటాస్ ఎయిర్లైన్స్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు