TS News: న్యాయం కోసం బైక్‌పై దిల్లీకి బయలుదేరిన యువకుడు!

న్యాయం చేయాలని కోరుతూ ప్రధానిని కలిసేందుకు ఓ యువకుడు ద్విచక్రవాహనంపై దిల్లీకి బయలుదేరాడు.

Published : 07 Dec 2021 02:21 IST

ఇల్లందు: న్యాయం చేయాలని కోరుతూ ప్రధానిని కలిసేందుకు ఓ యువకుడు ద్విచక్రవాహనంపై దిల్లీకి బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన సుందర్.. ఖమ్మం జిల్లా సింగరేణి పరిధిలోని ఉపరితల గని విస్తరణలో భాగంగా తమ భూములను కోల్పోయారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని సింగరేణి సంస్థను కోరుతూ గత ఐదేళ్లుగా పలు విధాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమందికి విన్నవించినా న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ ఇటీవల సుందర్ ఇల్లందులో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సుందర్ కుమారుడు సంజయ్.. ప్రధానిని కలిసేందుకు ద్విచక్రవాహనంపై గత నెల 29న దిల్లీ బయలుదేరాడు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని