Viveka Murder Case: ఇవేం ఉత్తర్వులు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశంలో సీజేఐ అసహనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.
దిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్ రద్దు చేసి జూన్ 30 తర్వాత మళ్లీ బెయిల్ ఇవ్వాలని వెంటనే ఉత్తర్వులు ఇవ్వడంపై సీజేఐ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల షరతును ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హంతకులు బయట ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సునీత పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణను వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చే వారం పిటిషన్పై విచారణ జరపనుంది.
వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్పై బయట ఉండటం వల్ల కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని.. సహకరించేందుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదని సీబీఐ గతంలో ఆరోపించింది. ఆ మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఏప్రిల్ 27న బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మే 5లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి సూచించింది.
వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30న ముగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 30వ తేదీ వరకు దర్యాప్తునకు గడువు ఉన్నందున అప్పటివరకు మాత్రమే ఎర్ర గంగిరెడ్డిని రిమాండ్కు తరలించాలని బెయిల్ రద్దు తీర్పు వెల్లడించిన సమయంలో హైకోర్టు షరతు విధించింది. జూన్ 30 తర్వాత ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని సీబీఐ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తీర్పు అనంతరం తన న్యాయవాది సూచన మేరకు మే 5న ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే, హైకోర్టు షరతుపై తాజాగా సీజేఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు