
Updated : 25 Jan 2022 03:47 IST
AP news : ఆ మహిళల ఖాతాల్లోకి నేడు రూ.15 వేలు జమ !
అమరావతి : అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మంగళవారం వర్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జగన్ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం చేయనున్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులు. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ, ఇతర మహిళలకు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.
Tags :