వైకాపా ఎమ్మెల్యే అంబటికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా ఆరువేలకుపైగా....

Published : 22 Jul 2020 20:24 IST

వీడియో ద్వారా తెలియజేసిన రాంబాబు

సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా ఆరువేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు కరోనా దెబ్బ తప్పడం లేదు. సత్తెపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ మేరకు వీడియో ద్వారా స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.  అవసరమైతే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తానని, క్షేమంగా మళ్లీ మీ ముందుకు వస్తానని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని