Andhra News: మహిళపై విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల చిందులు..

వీధిలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరిన ఓ మహిళపై విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చిందులేశారు.

Published : 19 Apr 2022 17:14 IST

విజయనగరం: వీధిలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరిన ఓ మహిళపై విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చిందులేశారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కేఎల్‌ పురంలో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే హాజరయ్యారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఓ మహిళ తమ వీధిలోని మురుగు కాల్వ సమస్యను నగర పాలక సంస్థ అధికారులకు విన్నవించుకునే ప్రయత్నం చేశారు. కాల్వ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఎమ్మెల్యే కోలగట్ల కలగజేసుకుని సమస్యను ఇప్పుడు చెప్పడమేంటంటూ ఆ మహిళపై మండిపడ్డారు. వాటర్‌ ట్యాంక్‌ కావాలా? వద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం సరదాకి ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? తమాషానా? కూర్చో.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని