Andhra News: పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ నందిగం సురేశ్‌ హల్‌చల్‌

విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌తో పాటు ఆయన అనుచరులు హల్‌చల్‌ చేశారు...

Updated : 16 Feb 2022 10:40 IST

కృష్ణలంక: విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌తో పాటు ఆయన అనుచరులు హల్‌చల్‌ చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తాము ఎంపీ నందిగం సురేశ్ అనుచరులమంటూ యువకులు హంగామా చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ సురేశ్‌ పోలీసులతో మాట్లాడేందుకు పీఎస్‌కు వెళ్లారు. స్టేషన్‌లో పోలీసులతో ఎంపీ బాహాబాహీకి దిగేలా పరిస్థితులు తలెత్తాయి.

ఈ క్రమంలో ఎస్సైతో ఎంపీ అనుచరులు వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎంపీ అనుచరులు కానిస్టేబుల్‌ ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లారు. తన ఫోన్‌ అడిగిన కానిస్టేబుల్‌పై మళ్లీ చేయిచేసుకున్నారు. యువకుల్లో ఎంపీ సురేశ్ సమీప బంధువు ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని