వర్క్ ఫ్రమ్ హోం ఎఫెక్ట్: ఉద్యోగుల్లో కొత్త రుగ్మత!
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా సోకుతుందోనని ప్రజలంతా క్షణక్షణం భయపడుతున్నారు. చలికాలంలో కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో కరోనా భయం మరింత పెరిగింది. దీనితోనే సతమతవుతున్నారనుకుంటే..
ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా సోకుతుందోనని ప్రజలంతా క్షణక్షణం భయపడుతున్నారు. చలికాలంలో కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో కరోనా భయం మరింత పెరిగింది. దీనితోనే సతమతవుతున్నారనుకుంటే.. తాజాగా ఓ రుగ్మత వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల్ని పట్టిపీడిస్తోంది. దీని నుంచి బయటపడటం కోసం శస్త్రచికిత్స చేయించుకుంటున్నారట.
కరోనా మహమ్మారి వల్ల విధి నిర్వహణలో చాలా మార్పులు వచ్చాయి. అనేక సంస్థలు తమ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోం చేయమంటున్నాయి. దీంతో ఉద్యోగులు ఇంటికే పరిమితమై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా సహ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, క్లయింట్లతో జూమ్ తదితర యాప్ల ద్వారా వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. అయితే, ఈ వీడియో సమావేశాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ‘జూమ్ డిస్మోర్ఫియా’ పెరుగుతోందట. తమ శరీరం లేదా ముఖంలో లోపాలు ఉంటే వాటి వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి.. మానసికంగా ఇబ్బంది పడుతారు. ఈ రుగ్మతనే ‘డిస్మోర్ఫియా’ అంటారు. ఇటీవల ఉద్యోగులు వీడియో సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడు తమ ముఖంలో లోపాలు చూసుకొని మానసికంగా బాధపడుతున్నారట. ఆ లోపాలను సరిదిద్దుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నట్లు అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
ఇది వరకు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు కాబట్టి.. తమ రూపు గురించి మరీ పెద్దగా ఆలోచించేవారు కాదు.. కానీ, ఇప్పుడు వీడియో సమావేశాల్లో ఉద్యోగులు తమ ముఖాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుండటంతో ముఖంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయట. దీంతో వారిలో ‘డిస్మోర్ఫియా’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే అందంగా కనిపించడం కోసం చాలా మంది ఉద్యోగులు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ముక్కు సరి చేయించుకోవడం, ముడతలు తొలగించుకోవడం వంటివి చేస్తున్నారట. ఈ మధ్య కాలంలో గూగుల్సెర్చ్లో ఎక్కువగా ‘అక్నే’, ‘హెయిర్లాస్’ వంటి అందానికి సంబంధించిన పదాలను ఎక్కువగా సెర్చ్ చేయడమే ‘జూమ్ డిస్మోర్ఫియా’ పెరుగుతోందనడానికి ఉదాహరణగా నిలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్