కేబినెట్లోకి మరో ఏడుగురు మహిళలు
కేంద్రంలో మహిళా మంత్రుల సంఖ్యాబలం మరింత పెరిగింది. కొత్తగా మరో ఏడుగురు బుధవారం
11కు చేరిన సంఖ్యాబలం
దిల్లీ: కేంద్రంలో మహిళా మంత్రుల సంఖ్యాబలం మరింత పెరిగింది. కొత్తగా మరో ఏడుగురు బుధవారం సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో కలిపి మొత్తం మహిళా మంత్రుల సంఖ్య 11కి చేరింది. ఈమేరకు కొత్తగా మంత్రిమండలిలో చేరినవారిలో మీనాక్షి లేఖి, శోభ కరంద్లాజే, అనుప్రియ సింగ్ పటేల్, దర్శన విక్రమ్ జర్దోష్, అన్నపూర్ణ దేవి, ప్రతిమా భౌమిక్, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్లు ఉన్నారు. వీరిలో తొలిసారి ఎంపీలు అయినవారు ముగ్గురున్నారు. అనుప్రియ సింగ్ పటేల్ గతంలో ప్రధాని మోదీ నేతృత్వంలో వైద్య, ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీల (కేబినెట్ మంత్రులు)తో పాటు సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్ సరూతాలు ఇప్పటికే మంత్రిమండలిలో ఉన్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా ఉన్న దేబశ్రీ చౌధురి బుధవారం ఉదయం రాజీనామా చేశారు. మోదీ తొలి ప్రభుత్వం (2014-19)లో 9 మంది మహిళా మంత్రులుండేవారు.
నేడు కేబినెట్, మంత్రిమండలి భేటీ!
విస్తరణ నేపథ్యంలో కేంద్ర కేబినెట్, మంత్రిమండలి భేటీలు గురువారం నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రధాని ఈ భేటీలను నిర్వహిస్తుంటారు. ఈ రెండు సమావేశాలూ సాయంత్రం ఒకదాని వెంట మరొకటి నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మంత్రులకు ప్రధాని అభినందనలు
కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణస్వీకారం తన సహచరులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, భారత్ను సుదృఢమైన సౌభాగ్య దేశంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అభినందనలు తెలిపారు.
16 మంది తొలిసారి ఎంపీలైనవారే..
కొత్తగా మొత్తం 36 మంది కేంద్ర మంత్రులుగా బుధవారం ప్రమాణస్వీకారం చేయగా.. వారిలో 16 మంది తొలిసారి ఎంపీలైనవారున్నారు.
సగటు వయసు 58..
విస్తరణ అనంతరం కేంద్ర మంత్రిమండలి సగటు వయసు 61 నుంచి 58 ఏళ్లకు తగ్గింది. మంత్రుల్లో 35 ఏళ్ల నిశీథ్ ప్రామాణిక్ (పశ్చిమబెంగాల్లోని కూచ్బిహార్ ఎంపీ) పిన్న వయస్కులు. 72 ఏళ్ల సోమ్ ప్రకాశ్ వయసులో అందరికంటే పెద్దవారు. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన 43 మంది మంత్రుల్లో సగటు వయసు 56 ఏళ్లు.
వైద్యులు.. న్యాయవాదులు.. ఇంజినీర్లు..
ప్రధాని మోదీ మంత్రిమండలిలోకి కొత్తగా చేరిన 36 మందిలో చాలామంది వివిధ వృత్తి నిపుణులున్నారు. వీరిలో పలువురు ఇంజినీర్లు కాగా.. 8 మంది న్యాయవాదులు, నలుగురు వైద్యులు, ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు, నలుగురు ఎంబీఏ పూర్తిచేసినవారు ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారుల్లో ఒడిశాకు చెందిన అశ్వనీ వైష్ణవ్, బిహార్కు చెందిన రాంచంద్ర ప్రసాద్ సింగ్లు ఉన్నారు. వైద్యుల్లో పశ్చిమబెంగాల్కు చెందిన సుభాస్ సర్కార్ (గైనకాలజిస్ట్), మహారాష్ట్రకు చెందిన భగవత్ కిషన్రావు కరడ్ (జనరల్, పిడియాట్రిక్ సర్జన్), భారతి ప్రవీణ్ పవార్ (ఎంబీబీఎస్), గుజరాత్కు చెందిన ముంజపర మహేంద్రభాయ్ (కార్డియాలజిస్ట్)లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం