Covid: కరోనా రోజూవారీ జీవితంలో భాగం కానుందా..?
అగ్రదేశం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
అమెరికాలో విజృంభిస్తోన్న డెల్టా
త్వరలో గరిష్ఠస్థాయికి మహమ్మారి
వాషింగ్టన్: అగ్రదేశం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. త్వరలో వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఏమాత్రం ఉదాసీనత వద్దని ప్రజలు, అధికారుల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ వైరస్ రోజువారీ జీవితంలో భాగం కానుందని, ఒక ఫ్లూ మాదిరిగా ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోనుందని అంటున్నారు.
అమెరికాలో నిత్యం లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రోజువారీ కేసుల వృద్ధి కాస్త మందగించడం, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ, ఇప్పటికీ నమోదవుతోన్న సంఖ్య ఏమాత్రం తక్కువ కాదని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోజుకు సుమారు 1,800 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షమందికి పైగా కొవిడ్ తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీకాలు తీసుకోని వారిలోనే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఇప్పటికే అక్కడి వైద్యులు గుర్తించారు. తప్పుడు సమాచారం కారణంగా కొందరిలో టీకాలపై అనుమానాలు నెలకొన్నాయి. దాంతో వారికి టీకాలు వేయడం అధికారులకు సవాలుగా మారుతోంది.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హన్సోటీ మాట్లాడుతూ.. మునుపటి ముప్పు నుంచి మనం నేర్చుకోకపోతే మరోసారి వైరస్ విజృంభించే అవకాశం ఉందన్నారు. వైరస్లో కొత్త రకాలతోపాటు శీతకాలం ప్రారంభం కావడంతో చల్లని వాతావరణం కారణంగా ఇంటిలోపలే ఎక్కువ సేపు ఉండాల్సి రావడం మరో ముప్పునకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. శీతకాలంలో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరి తగ్గడం, మళ్లీ పెరగడం.. ఇలాంటి సందర్భాలున్నాయని కెనడాకు చెందిన వైరాలజిస్టు ఏంజెలా రాస్ముస్సెన్ అన్నారు. ఈ ముప్పు నేపథ్యంలో జనాభాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందడం ఆవశ్యకమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అర్హులైన జనాభా(12 ఏళ్లు పైబడినవారు)లో 63.1 శాతం మందికి పూర్తిగా టీకాలు అందాయి. మొత్తం జనాభా పరంగా చూసుకుంటే అది 54 శాతంగా ఉంది. అమెరికాలో టీకాల లభ్యత సమృద్ధిగా ఉన్నప్పటికీ.. పోర్చుగల్(81 శాతం), యూఏఈ(79 శాతం) కంటే వెనుకబడే ఉండటం గమనార్హం.
వ్యాక్సినేషన్తో పాటుగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యలపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ హాట్స్పాట్లలో ప్రజలు మాస్క్లు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని చెప్తున్నారు. అలాగే పాఠశాలలు, వ్యాపార కార్యకలాపాలు సాగేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని చెప్తున్నారు. ఇంకోపక్క వైరస్ సహజ సంక్రమణ, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన నిరోధకతతో దేశం హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వీటిపై ఏంజెలా స్పందించారు. హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువైనట్లు ఇప్పుడే ప్రకటించడం తొందరపాటే అవుతుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వయోజనుల్లో వ్యాక్సినేషన్ రేటు 50 శాతం కంటే తక్కువగానే ఉందని గుర్తుచేశారు.
ఎండెమిక్గా మారనుందా..?
కొత్త రకాలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. వాటిలో డెల్టా ప్రభావం తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో మ్యుటేషన్ల కారణంగా కొత్త వేరియంట్లకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే టీకాలే వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని, రాబోయే రోజుల్లో పిల్లలకు టీకాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. వృద్ధులు, బలహీన రోగ నిరోధక శక్తి ఉన్నవ్యక్తుల్ని బూస్టర్ డోసులు ఆదుకుంటాయని భావిస్తున్నారు. అయితే ఈ వైరస్ను పూర్తిగా నిర్మూలించడం వీలుకాకపోవచ్చని, ఇది ఎండెమిక్(వ్యాధి ఒక దేశం, ఒక ప్రాంతానికే పరిమితమవడం, ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి)గా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో ఇది ఫ్లూ మాదిరిగా ఉందన్నారు. అయితే దీనిపై వారు స్పష్టమైన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. -
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్