మిలటరీ దుస్తుల్లో వచ్చి..విద్యార్థుల అపహరణ

బోకోహరంకు చెందిన వారుగా అనుమానిస్తున్న కొందరు ఉగ్రవాదులు మిలటరీ దుస్తుల్లో వచ్చి వందలాది మంది విద్యార్థులను అపహరించిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. భద్రతా దళాలు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం రాత్రి కొందరు మిలటరీ దుస్తులు ధరించి కగరలోని ప్రభుత్వ కళాశాల వసతిగృహానికి వెళ్లి

Published : 18 Feb 2021 01:48 IST

నైజీరియాలో నేరస్థుల ముఠా దుశ్చర్య

అబుజా: బోకోహరం ఉగ్రవాద ముఠాకు చెందిన వారుగా అనుమానిస్తున్న కొందరు మిలటరీ దుస్తుల్లో వచ్చి వందలాది మంది విద్యార్థులను అపహరించిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. భద్రతా దళాలు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం రాత్రి కొందరు మిలటరీ దుస్తులు ధరించి కగరలోని ప్రభుత్వ కళాశాల వసతిగృహానికి వెళ్లి వారిని తుపాకులతో బెదిరించారు. అనంతరం వందల మంది విద్యార్థులను, కొందరు ఉపాధ్యాయులను దగ్గర్లో ఉన్న అడవిలోకి లాక్కువెళ్లారు. ఈ ఘటనలో ఒక విద్యార్థిని తుపాకులతో కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. అపహరణకు గురైన వారిలో ఒక ఉపాధ్యాయుడు, కొందరు విద్యార్థులు తప్పించుకున్నట్లు వారు వెల్లడించారు. ఎంతమందిని అపహరించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని వారు తెలిపారు. విద్యార్థులను కనిపెట్టేందుకు అన్ని రకాల చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

నైజీరియాలోని చాలా ప్రాంతాల్లో తరచూ చిన్నారుల అపహరణలు జరుగుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బోకోహరం ఉగ్రవాదులే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం కట్సిన రాష్ట్రంలో ఓ పాఠశాలకు చెందిన 300లకు పైగా విద్యార్థులను  ఉగ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2014లో ఓ బాలికల వసతిగృహంపై దాడి చేసి 270 మందిని అపహరించారు. వారిలో చాలా మంది ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని