కొవిడ్ ముప్పు: 10రెట్ల వేగంతో వ్యాపించే వైరస్..!
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తపుంతలు తొక్కుతోంది. తాజాగా కొవిడ్ 19 వైరస్ D614G రకం ఉత్పరివర్తనం (మ్యుటేషన్) బయటపడినట్లు మలేషియా పరిశోధకులు వెల్లడించారు.
మలేషియాలోనూ బయటపడ్డ D614G రకం మ్యుటేషన్!
ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరం
కౌలాలంపూర్: ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తపుంతలు తొక్కుతోంది. తాజాగా కొవిడ్ 19 వైరస్ D614G రకం ఉత్పరివర్తనం (మ్యుటేషన్) బయటపడినట్లు మలేషియా పరిశోధకులు వెల్లడించారు. అత్యంత వేగంగా వ్యాపించే ప్రభావం ఉన్న ఈ వైరస్ను ఎదుర్కోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఈ తరహా మ్యుటేషన్ ఇప్పటికే పలుదేశాల్లో బయటపడ్డట్లు నిపుణులు పేర్కొన్నారు.
చైనాలో పుట్టిన వైరస్ రూపాంతరం చెందుతూ ప్రపంచదేశాలను సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే ఈ వైరస్ ఎన్నో ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అయితే వాటి స్వభావం, తీవ్రతపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ప్రమాదకరంగా భావిస్తోన్న D614G రకం మ్యుటేషన్ను మలేషియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్ గుర్తించింది. ఎవరైనా సూపర్ స్ప్రెడర్తో ఈ వైరస్ అత్యంత సులభంగా, 10రెట్ల వేగంతో ఇతరులకు సోకుతుందని మలేషియా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నూర్ హిషమ్ అబ్దుల్లా ప్రకటించారు. అయితే బయటపడిన రెండు క్లస్టర్లలోనూ మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైరస్ కట్టడికి తీసుకున్న పకడ్బందీ చర్యలవలన పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే, D614G రకం మ్యుటేషన్ను జులై నెలలోనే కనుగొన్నారు. ఈ తరహా మ్యుటేషన్పై వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తాయనే విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ‘కరోనా’ కొమ్ము ప్రొటీన్లోని ‘D614G’ మార్పుల వల్ల ఈ వైరస్ కొత్తరూపాన్ని ధరించిందని అమెరికాలోని లాస్ ఆల్మోస్ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. బ్రెజిల్, ఐరోపా, మెక్సికో, వుహాన్లలో ఇప్పటికే ఏడు ‘D614G’ రకాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్ ఉత్పరివర్తనపై శాస్త్ర సమాజంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇలాంటి వైరస్ మ్యుటేషన్ చెందుతూ తన జన్యుక్రమాన్ని మార్చుకోవడం ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీకి పెను సవాలుగా మారుతుందని కొందరు శాస్త్రవేత్తల ఆందోళన చెందుతున్నారు. అయితే, మ్యుటేషన్ సహజమని, ప్రమాదకరమేమీ కాదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘D614G’ ఉత్పరివర్తనపై మరింత పరిశోధన అవసరమని టీకా అభివృద్ధికి ఇది పెద్ద అవరోధం కాబోదని ఆస్ట్రేలియాలోని భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ శేషాద్రి వాసన్ అభిప్రాయపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి వ్యక్తిగత చర్యలు కచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు