POCSO: పోక్సో చట్టానికి పదేళ్లు.. ఒక్కో కేసుకు 17నెలల సమయం
పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతున్నప్పటికీ.. తక్కువ కేసుల్లోనే నేర నిర్ధారణ అవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఏడాది లోపే కేసు పరిష్కారం కావాల్సి ఉండగా.. సరాసరి ఒక్కో కేసుకు 17 నెలల సమయం పడుతోందని తెలిపింది. చాలా రాష్ట్రాల్లో ఈ కేసులు ప్రతిఏటా పేరుకుపోతున్నాయని వెల్లడించింది.
దిల్లీ: పోక్సో (POCSO) చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ప్రతి మూడు కేసుల్లో ఒకటికి మాత్రమే శిక్ష ఖరారవుతోందని తాజా నివేదిక వెల్లడించింది. చండీగఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే నిర్ణీత గడువు (ఏడాదిలోపు)లో ఈ కేసుల విచారణ పూర్తవుతోందని తెలిపింది. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను కట్టడి కోసం తీసుకు వచ్చిన పోక్సో చట్టం వచ్చి పదేళ్లు గడుస్తోన్న నేపథ్యంలో.. చట్టం అమలు, విచారణల్లో జాప్యం వంటి అంశాలపై ‘ఏ డికేడ్ ఆఫ్ పోక్సో’ పేరుతో అధ్యయనం జరిగింది. వరల్డ్ బ్యాంక్ (World Bank) భాగస్వామ్యంతో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అనే స్వతంత్ర సంస్థ చేపట్టిన ఈ అధ్యయనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
* అధ్యయనంలో భాగంగా సుమారు 4లక్షల పోక్సో కేసుల సమగ్ర సమాచారాన్ని (Meta Data) సేకరించగా.. అందులో 2.31లక్షల కేసును విశ్లేషించారు. తద్వారా పెండింగ్ కేసులు, తీర్పు క్రమాన్ని అంచనా వేశారు.
* ఈ కేసులు అత్యధికంగా పెండింగులో ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్ప్రదేశ్ ముందుంది. నవంబర్ 2012 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో నమోదైన పోక్సో కేసుల్లో సుమారు 77.77 శాతం కేసులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.
* ఈ పదేళ్ల కాలంలో తమిళనాడులో మొత్తం నమోదైన కేసుల్లో 80.2శాతం పరిష్కారమయ్యాయి.
* పోక్సో కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రతి ఒక దోషికి ముగ్గురు నిర్దోషులుగా తేలుతున్నారు. అధ్యయనం చేసిన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్దోషులే అధికంగా ఉన్నారు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్లో శిక్ష పడేవారితో పోలిస్తే ఏడు రెట్లు నిర్దోషులే ఉన్నారు.
* కేవలం కేరళలో మాత్రమే నిర్దోషులు, శిక్షపడే వారి మధ్య తక్కువ అంతరం ఉంది. 20.5శాతం కేసుల్లో నేరం నిరూపణ కాకపోగా .. 16.49శాతం కేసుల్లో శిక్ష పడుతోంది.
* పెండింగులో ఉన్న పోక్సో కేసుల సంఖ్య ఏటా పెరుగుతున్నప్పటికీ 2019 నాటికి ఆ సంఖ్య తగ్గింది. కానీ, ఆ తర్వాత కొవిడ్ మహమ్మారి విజృంభణతో న్యాయస్థానాల కార్యకలాపాలపై ప్రభావం పడటంతో మళ్లీ పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
* ఒక్కో కేసు పరిష్కారానికి సుమారు 509.78 రోజులు లేదా పదిహేడు నెలల కాలం పడుతోంది. పోక్సో చట్టం సెక్షన్ 35 ప్రకారం ఒక ఏడాదిలోపే కేసు పరిష్కారం కావాలి.
* ఈ విషయంలో చండీగఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మాత్రమే ఏడాదిలోపు కేసు విచారణను పూర్తిచేస్తున్నాయి.
* పోక్సో కేసుల్లో 56శాతం శారీరక లైంగిక దాడికి సంబంధించినవే ఉంటున్నాయి.
* లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షలు పడటం చాలా తక్కువగా ఉంటోంది. కేవలం 18శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి.
* మొత్తంగా 138 తీర్పులను విశ్లేషించగా.. 22.9శాతం నిందితులు బాధితులకు తెలిసినవారే ఉంటున్నారు. అందులో 3.7శాతం కేసుల్లో కుటుంబ సభ్యులే నిందుతులు కావడం గమనార్హం.
* 18శాతం కేసుల్లో నిందితులు, బాధితుల మధ్య అంతకుముందే సంబంధం ఉండగా.. 44శాతం కేసుల్లో వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు