Omicron Deaths: ప్రపంచంలో ఒమిక్రాన్ మరణాలెన్నంటే?
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. డెల్టా రకం కన్నా నాలుగు రెట్లు అత్యధికంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ వేరియింట్ గతేడాది .......
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. డెల్టా రకం కన్నా నాలుగు రెట్లు అత్యధికంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ వేరియింట్ గతేడాది నవంబర్ 24న తొలిసారి వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు 139 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, ప్రపంచ దేశాల్లో ఇప్పటిదాక 4,70,462 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఈ వేరియంట్ బారినపడిన వారిలో 108మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా యూకేలో 2,46,780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత డెన్మార్క్లో 57,125, అమెరికా 42,539, జర్మనీ 35,529, కెనడా 21,107, నార్వే 18,352, ఆస్ట్రియా 8,069, ఫ్రాన్స్ 5611, ఆస్ట్రేలియా 2765, ఇస్టోనియా 2497, ఇజ్రాయెల్ 2336, భారత్ 2307, సింగపూర్ 2251, థాయిలాండ్ 2062, దక్షిణాఫ్రికా 1894 చొప్పున పలు ప్రపంచ దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం వివరించింది.
ఇక భారత్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ పాకింది. మొత్తంగా 2135 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. వారిలో 828మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మన దేశంలో 1306 క్రియాశీల కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 653 ఒమిక్రాన్ కేసులు రాగా.. దిల్లీలో 464, కేరళ 185, రాజస్థాన్ 174, గుజరాత్ 154, తమిళనాడు 121, తెలంగాణ 84, కర్ణాటక 77, హరియాణా 71, ఒడిశా 37, యూపీ 31, ఆంధ్రప్రదేశ్ 24, పశ్చిమబెంగాల్ 20 చొప్పున నమోదైనట్టు పేర్కొంది. భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నమోదైంది. గత నెలలో ఒమిక్రాన్ బారినపడిన 73 ఏళ్ల వృద్ధుడు డిసెంబర్ 31న మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిసెంబర్ 15న జ్వరం, దగ్గు, ముక్కులో మంట వంటి లక్షణాలు కనబడటంతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు. అతడికి రెండు సార్లు కొవిడ్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. అదే శాంపిల్ని జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా పాజిటివ్గా వచ్చిందని పేర్కొన్నారు. అతడికి బీపీ, మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టు పేర్కొన్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.