operation dost: ప్రాణాలు కాపాడేందుకు పరుగులు పెట్టిన ‘దోస్త్’
తుర్కియే(Turkey)లో ఆపరేషన్ దోస్త్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొన్ని గంటల్లోనే సిద్ధమైపోయాయి. విదేశీ వ్యవహారాల శాఖ సమయాన్ని పట్టించుకోకుండా వందల కొద్దీ పేపర్లను ప్రాసెస్ చేసి దౌత్య ఏర్పాట్లు చేసింది.
ఇంటర్నెట్డెస్క్ : తుర్కియే(Turkey)లో భారత్(India) చేపట్టిన సహాయక కార్యక్రమాలు అక్కడి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. భూకంపం వచ్చి ఆ దేశం అతలాకుతలమైన తర్వాత.. చాలా వేగంగా స్పందించి సహాయక బృందాలను పంపిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. తుర్కియే(Turkey) భూకంపం వార్త తెలిసిన వెంటనే భారత్ 152 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేసింది. ఈ బృందంలో 18 నెలల వయసున్న కవలలను ఇంటి వద్దే వదిలిన ఓ తల్లి కూడా సభ్యురాలు కావడం విశేషం. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆమె యూనిఫాం వేసుకొని దేశం కాని దేశానికి తరలి వెళ్లింది. అధికారులు దౌత్య నిబంధనలు పూర్తి చేయడానికి సమయం లెక్కచేయకుండా వందల కొద్దీ పత్రాలను ప్రాసెస్ చేశారు. అక్కడికి చేరుకొన్న భారత బృందం 10 రోజుల పాటు వేలాది మందికి సేవలు అందించి ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సందర్భంగా వారి అనుభవాలను పంచుకొన్నారు.
మొత్తం మూడు బృందాల్లో 152 మంది సభ్యులను, ఆరు జాగీలాలను అక్కడకు పంపేందుకు గంటల్లోనే సిద్ధం చేశారు. వీరిలో కేవలం కొందరికే దౌత్య పాస్పోర్టులు ఉన్నాయి. కోల్కతా, వారణాసిలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఫ్యాక్స్, ఈమెయిల్స్లో పంపిన వందల పత్రాలను విదేశాంగ శాఖ రాత్రికి రాత్రే ప్రాసెసింగ్ చేసింది. మరో వైపు తుర్కియే(Turkey) కూడా భారత బృందాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పించింది. భారత బృందాలు గజియన్తెప్ ప్రావిన్స్లోని నర్దాగి, హతాయ్ వద్దకు చేరుకొన్నాయని సెకండ్ ఇన్ కమాండెంట్ రాకేశ్ రంజన్ వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందంలోని ఐదుగురు మహిళా సభ్యురాల్లో సుష్మా యాదవ్ (32) అనే కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఆమె తొలిసారి విదేశాల్లో విపత్తు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకోసం ఆమె తన 18 నెలల కవల పిల్లలను ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆమె అత్త పసిపిల్లల బాధ్యతలు చూసుకొన్నారు. ఈ విపత్తు సమయంలో తాము కాకపోతే ఇంకెవరు వెళతారని సుష్మా భావించారు. టర్కీలో -5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఆమె ధైర్యంగా పనిచేశారు. శిథిలాల నుంచి కాపాడిన వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడం ఆమె బృందం విధి.
డిప్యూటీ కమాండెంట్ అధికారి దీపక్ మాట్లాడుతూ అక్కడి ప్రజలు భారత బృందం సేవలకు చలించిపోయారన్నారు. భార్య, ముగ్గురు పిల్లలను భూకంపంలో కోల్పోయిన అహ్మద్ అనే వ్యక్తి అక్కడ భారత బృందం వెంటే ఉన్నాడు. బృందసభ్యుల్లో శాకాహార అవసరాలు తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని దీపక్ గుర్తు చేసుకొన్నారు. అతడి వద్ద అందుబాటులో ఉన్న కాయగూరలతో వంటకం తయారు చేసి అందించేవాడని వెల్లడించారు. భారత బృందంతో అక్కడి ప్రజలు ప్రత్యేక అనుబంధం పెంచుకొన్నారని చెప్పారు.
తుర్కియే(Turkey)లో భవనాలు నిట్టనిలువునా కూలడంతో శిథిలాలను తొలగించడం అత్యంత క్లిష్టమైన పని. ఈ స్థితిలో కూడా భారత బృందం ఇద్దరు బాలికలను శిథిలాల అడుగు నుంచి రక్షించింది. దీంతోపాటు 85 మృతదేహాలను వెలికి తీసింది. ఈ బృందం ఇటీవలే భారత్ చేరుకోగా.. ప్రధాని నరేంద్ర మోదీ లోక్కల్యాణ్ మార్గ్లోని నివాసంలో వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఇక భారత సైన్యం అక్కడ వైద్యశాలను ఏర్పాటు చేసి వేల మందికి చికిత్సను అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?