నవజాత శిశువు ఉసురు తీసిన కొవిడ్‌

అహ్మదాబాద్‌: కరోనా మహమ్మారి మరో నవజాత శిశువు ఉసురు తీసింది. వైరస్‌తో పదిహేను రోజుల కిందట జన్మించిన ఆ శిశువు.. మృత్యువుతో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 19 Oct 2022 15:28 IST


అహ్మదాబాద్‌: కరోనా మహమ్మారి ఓ నవజాత శిశువు ఉసురు తీసింది. వైరస్‌తో పదిహేను రోజుల కిందట జన్మించిన ఆ శిశువు.. మృత్యువుతో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సూరత్‌కు చెందిన ఓ కొవిడ్‌ బాధితురాలు ఏప్రిల్‌ 1న ఓ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి వైరస్‌ సోకివుండటంతో శిశువుకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో తల్లీబిడ్డలను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పసిబిడ్డను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ కూడా ఇచ్చారు. ఆపై సూరత్‌ మాజీ మేయర్‌ జగదీశ్‌ పటేల్‌ ప్లాస్మా దానం చేశారు. ఇంతలోనే పుట్టినప్పటి నుంచి మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆ నవజాత శిశువు గురువారం రాత్రి కన్ను మూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని