India Corona: కొనసాగుతోన్నఉద్ధృతి.. కొత్తగా 2.68 లక్షల కేసులు

దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 2,68,833 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజు కంటే నాలుగున్నర వేలకుపైగా అదనపు కేసులు...

Updated : 15 Jan 2022 16:33 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 2,68,833 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజు కంటే నాలుగున్నర వేలకుపైగా అదనపు కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 16.66 శాతానికి చేరింది. నిన్న 16.13 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6041కి పెరిగింది.

కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు 14 లక్షలు దాటాయి. క్రియాశీల కేసుల రేటు 3.85 శాతానికి ఎగబాకింది. నిన్న 1.22 లక్షలకుపైగా రోగులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 94.83 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 402 మంది మృతి చెందారు. మొత్తంగా 4.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 57.37 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. 3.92 లక్షల మంది ప్రికాషన్‌ డోసు పొందారు. ఇప్పటివరకు మొత్తం 156.02 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు