Bihar: మధ్యాహ్న భోజనం తిని 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు..!

బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైన ఘటన బిహార్‌లోని భాగల్పూర్‌లో చోటు చేసుకుంది.

Updated : 11 Nov 2022 15:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బల్లి పడినట్లు అనుమానిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని బలవంతంగా తినిపించడంతో 200 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైన ఘటన బిహార్‌లోని భాగల్పూర్‌లో చోటు చేసుకొంది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ట్యూషన్‌ క్లాసులకు వెళ్లగా.. అక్కడ ఒకరికి వాంతులయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలిన విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పాఠశాల సమీపంలోని ఓ వైద్యకేంద్రానికి విద్యార్థులను తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

8వ తరగతి విద్యార్థి ప్లేట్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో ఈ విషయాన్ని విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. కానీ, ఆయన దానిని బల్లి కాదని.. వంకాయని విద్యార్థులకు చెప్పాడు. పాఠశాల అధికారులు కూడా విద్యార్థులను ఆహారం తినాలని బలవంతం చేశారు. ఆ ఆహారం తిన్న తర్వాతే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను విద్యా శాఖ తీవ్రంగా పరిగణించింది. పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు వైద్యశాల వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు