15 దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా

భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్లను ఇప్పటి వరకూ 15 దేశాలకు సరఫరా చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం తెలిపారు. పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఆయన.......

Updated : 06 Feb 2021 13:09 IST

దిల్లీ: భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్లను ఇప్పటి వరకూ 15 దేశాలకు సరఫరా చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం తెలిపారు. పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పొరుగు దేశాలకు సహాయం చేసేందుకు కొన్ని పంపగా, మరొకొన్ని వాణిజ్య ఒప్పందాల మేరకు పంపినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్‌ సహాయం కోరిన దేశాల్లో ఆఫ్గానిస్థాన్‌, అల్జీరియా, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, కువైట్‌, మాల్దీవులు, మారిషస్‌, మొరాకో, మంగోలియా, మయన్మార్‌, నేపాల్‌, ఒమన్‌, సౌదీ అరేబియా, సౌత్‌ ఆఫ్రికా, యూఏఈ, పసిఫిక్‌ ఐస్లాండ్‌ దేశాలు మరికొన్ని ఉన్నాయని ఆయన తెలిపారు. ‘‘మొత్తం 22 దేశాల నుంచి వ్యాక్సిన్‌ కోసం అభ్యర్థనలు వచ్చాయి. వాటిలో 15 దేశాలకు ఇప్పటికే వ్యాక్సిన్లను పంపాం. ఫిబ్రవరి రెండు నాటికి 56 లక్షల డోసులను పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా పంపాం. 105 లక్షల డోసులను వాణిజ్య ఒప్పందాలు చేసుకొని పంపాం’’ అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల పంపిణీ జరుగుతోంది. మార్చి నెలలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలివ్వడం పూర్తవుతుందని మంత్రి తెలిపారు. ఆ వెంటనే యాభై ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తామని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

భారత రక్షణ రంగం బలోపేతం

ఆ 21 గ్రామాల్లో ఒక ఓటర్‌.. రెండు ఓట్లు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు