Metro Station: మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకిన ఆ యువతి మృతి

దిల్లీ అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ గోడపైకి ఎక్కి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది.......

Published : 15 Apr 2022 22:26 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ గోడపైకి ఎక్కి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా ఆమెను CISF సిబ్బంది ప్రాణాలతో కాపాడిన విషయం తెలిసిందే. అయితే గాయాలపాలైన ఆ యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. ఆమెను పంజాబ్‌కు చెందిన యువతి (22)గా గుర్తించారు.

గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్‌ 2 అంచుకు వెళ్లి నిలబడిన సదరు యువతిని కొందరు ప్రయాణికులు గమనించి సమాచారం ఇవ్వగా.. అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. ఆత్మహత్య చేసుకోవద్దంటూ ఎంతగానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె పట్టించుకోకుండా ఒక్కసారిగా కిందకు దూకేసింది. దీంతో స్థానికుల సాయంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన బ్లాంకెట్‌తో ఆమెను పట్టుకున్నారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో యువతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని