Tragedy: ‘మహా’ విషాదం.. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది శిశువులు సహా 24 మంది మృతి
Maharashtra Tragedy: నాందేడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ‘మహా’ విషాదం చోటుచేసుకుంది. ఔషధాల కొరత కారణంగా 24గంటల వ్యవధిలోనే 12మంది నవజాత శిశువులతో పాటు మొత్తం 24మంది మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
నాందేడ్: మహారాష్ట్ర(Maharashtra)లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఠాణే ప్రభుత్వ ఆస్పత్రి దుర్ఘటన మరువక ముందే తాజాగా నాందేడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఒకేరోజు 24 మంది మృత్యువాతపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో 12మంది నవజాత శిశువులు ఉండటం పెను విషాదం రేపుతోంది. ఆస్పత్రిలో ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టులో ఠాణేలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 18మంది రోగులు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
తాజాగా గడిచిన 24గంటల వ్యవధిలో ఆస్పత్రిలో 24 మంది మృతిచెందగా.. వీరిలో 12మంది నవజాతా శిశువులు ఉన్నారు. మృతుల్లో ఆరుగురు మగ శిశువులు ఉండగా.. ఆరుగురు ఆడ శిశువులు ఉన్నట్టు ఆస్పత్రి డీన్ వెల్లడించారు. మిగతా 12 మంది పలు వ్యాధులు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్టు చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (భాజపా, ఏక్నాథ్ శిందే- శివసేన, ఎన్సీపీ- అజిత్ వర్గం) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ మరణాలపై ఆస్పత్రి వైద్యుడు డా.శ్యామ్రావు వకోడే స్పందించారు. ‘‘ఒక్క వ్యవధిలో 12 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది వేర్వేరు కారణాలతో మరణించారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు వచ్చాయి. రోగుల కోసం కేటాయించిన బడ్జెట్ సర్దుబాటు కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
మళ్లీ అదే అజాగ్రత్త..! కఠిన చర్యలు తీసుకోండి: సుప్రియా సూలే
ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది నవజాతా శిశువులతో పాటు 24మంది మృతిచెందిన ఘటనను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలు ఖచ్చితంగా యాదృచ్చికం కాదన్న ఆమె.. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. గతంలో ఠానేలో ప్రదర్శించిన అజాగ్రత్తే ఈసారి కూడా కనిపిస్తోందని విమర్శించారు. ఒకరి తప్పుల్ని మరొకరు కప్పిపుచ్చుకొనేందుకు దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ప్రభుత్వం తీరును ఆక్షేపించారు. మహారాష్ట్ర ప్రజల ప్రాణాలంటే అంత చులకనా? అని మండిపడ్డారు. ఆస్పత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో మందులు అందడంలేదని రోగులు వాపోతున్నారని చెప్పారు. ఈ ఘటనలో కఠిన చర్య తీసుకోవాలని సుప్రియా సూలే డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రులతో రాజీనామా చేయించాలని, అలాగే, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం ఏక్నాథ్ శిందేను కోరారు.
తీవ్ర దిగ్భ్రాంతికరం.. ఆదిత్య ఠాక్రే
ఈ ఘటనపై శివసేన (యూబీటీ) నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 12మంది నవజాతా శిశువులు మృతిచెందడం చాలా తీవ్రమైన అంశమన్నారు. ఈ బాధాకరమైన సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. సకాలంలో మందులు సరఫరా చేయకపోవడం వల్లే రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అర్థమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడిందన్న ఆయన.. ముంబయిలోని పలు ప్రభుత్వ, మునిసిపల్ ఆసుపత్రుల్లో మందుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. దీని పర్యవసానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ప్రజలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా తాము గళం విప్పామని.. ప్రభుత్వానికి లేఖలు సైతం రాసినట్టు చెప్పారు. కేఈఎం ఆస్పత్రి వ్యవహారంలో పాదయాత్ర చేసినా శిందే సర్కార్ మౌనం వహిస్తోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో భారత్ కేవలం మాటలకే పరిమితం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్.. మధ్యప్రదేశ్లో హోరాహోరీ!
Exit poll 2023: రాజస్థాన్లో భాజపా.. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. -
పన్నూ హత్యకుట్ర కేసులో యూఎస్ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్ర పన్నారన్న కేసులో అమెరికా(USA) చేసిన ఆరోపణలపై భారత్ స్పందించింది. -
DAC: సైన్యానికి బిగ్ బూస్ట్..! 97 ‘తేజస్’ యుద్ధవిమానాల కొనుగోలుకు పచ్చజెండా
భారత సైన్యానికి 97 తేజస్ యుద్ధవిమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను సమకూర్చే ఒప్పందానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. -
Henry Kissinger: మోదీ ప్రసంగం వినేందుకు వీల్ఛైర్లో కిసింజర్ వచ్చిన వేళ..!
ప్రముఖ దౌత్యవేత్త, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్(Henry Kissinger) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వేళ పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ(Modi) మాట్లాడారు. ఆ క్రమంలో సరదా సంభాషణ చోటుచేసుకుంది. -
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువును ఎన్టీఏ పొడిగించింది. ఈ కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. -
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
శత్రు జలాంతర్గములను ఎదుర్కొనేందుకు భారత్ నౌకాదళానికి అదనపు శక్తి లభించింది. మూడు సరికొత్త యుద్ధ నౌకలు నేడు నౌకాదళానికి అందుబాటులోకి వచ్చాయి. -
కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామకం విషయంలో కేంద్రంతో నెలకొన్న వివాదంలో దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. -
విమానంలో భార్యాభర్తల గొడవ.. దారి మళ్లించి దిల్లీలో దించివేత
బ్యాంకాక్కు బయలుదేరిన మ్యూనిక్ - బ్యాంకాక్ ‘లుఫ్తాన్సా’ విమానాన్ని బుధవారం దారి మళ్లించి దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. -
విధానసౌధ వాకిట గజరాజులు
చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు. -
గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ
దేశంలో గవర్నర్ ఏడీసీ (ఎయిడ్ ది క్యాంప్)గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 2015 బ్యాచ్కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢిని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
భారత్కు తిరిగొచ్చిన అంజూ
ఫేస్బుక్లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్కు వచ్చింది. -
81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు
వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
భారత్లో అసాధారణ వాతావరణం
భారత్లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని బుధవారం తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. -
2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు
అహ్మదాబాద్ - ముంబయి మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుందని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
మేం దిల్లీ వీడుతాం!
ముంబయి, దిల్లీ నగర వాసులను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు
హిమాలయ ప్రాంత పర్యావరణ వ్యవస్థ సున్నితత్వం, సంక్లిష్టతలను సిల్క్యారా సొరంగ ప్రమాద ఘటన మన కళ్లకు కట్టింది. ఇక్కడి ప్రాజెక్టుల మదింపు ప్రక్రియ వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది. -
సొరంగం నుంచి కుమారుడు బయటకు రావడానికి కొన్ని గంటల ముందే తండ్రి మరణం
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న తన కుమారుడి కోసం 16 రోజులు ఊపిరి బిగపట్టి ఎదురుచూసిన ఓ తండ్రి.. చివరకు తన బిడ్డ బయటకు రావడానికి కొన్ని గంటల ముందు కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఇది. -
చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్లో 6 రాష్ట్రాలు అప్రమత్తం
చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
గురుపత్వంత్ హత్యకు కుట్రపై దర్యాప్తునకు కమిటీ
సిక్స్ ఫర్ జస్టిస్’ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా భూభాగంపై హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని భారత్ ఏర్పాటు చేసింది.


తాజా వార్తలు (Latest News)
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన
-
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!