United Nations: 2.5కోట్ల మంది చిన్నారులు మళ్లీ బడి ముఖం చూడరేమో..!
కరోనా మహమ్మారి ప్రపంచ గమనంపై పెను ప్రభావాన్ని చూపింది. అన్నింటిలోకెల్లా విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి.. చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. ఏడాదిన్నరగా విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2.5 కోట్ల మంది చిన్నారులు మళ్లీ పాఠశాలల ముఖం చూడకపోవచ్చని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచ గమనంపై పెను ప్రభావాన్ని చూపింది. అన్నింటిలోకెల్లా విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి.. చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. ఏడాదిన్నరగా విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీనిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2.5 కోట్ల మంది చిన్నారులు మళ్లీ పాఠశాలల ముఖం చూడకపోవచ్చని ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
‘మనం విద్యాసంక్షోభానికి మధ్యలో ఉన్నాం. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో 15.6 కోట్ల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. 2.5 కోట్ల మంది చిన్నారులు తిరిగి బడుల ముఖం చూడకపోవచ్చు. ఈ ఉత్పాతం నుంచి బయటపడాలంటే.. డిజిటల్ లెర్నింగ్ సహా విద్యావ్యస్థకు సంబంధించిన పలు విభాగాలపై పెట్టుబడులు అవసరం’ అని గుటెరస్ సూచించారు. మహమ్మారి వేళ.. పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉండటంతో వారు హింస, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు పెరిగాయని ఆయన గతంలో హెచ్చరించారు. కొవిడ్ రికవరీ ప్రణాళికలో చిన్నారుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా.. ఒకవైపు ప్రపంచ దేశాలు కరోనా టీకా కార్యక్రమంపై దృష్టిసారించగా, మరోపక్క డెల్టా వేరియంట్ విజృంభిస్తూ, ప్రపంచాన్ని మరోసారి ఆంక్షలవైపు మళ్లిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు 20 కోట్లకు సమీపిస్తుండగా.. 40లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని