Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. చిక్కుకుపోయిన 29 మంది పర్వతారోహకులు!

ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఊహించని ప్రమాదం! అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా 29 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకున్నారు. ఇక్కడి ద్రౌపది దండా-2 పర్వత శిఖరాగ్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 04 Oct 2022 15:54 IST

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో ఊహించని ప్రమాదం! అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం(Avalanche) కారణంగా 29 మంది ట్రైనీ పర్వతారోహకులు(Mountaineers) చిక్కుకుపోయారు. ఇక్కడి ద్రౌపది దండా-2 శిఖరాగ్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ(Pushkar Singh Dhami) ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాధితులంతా ఉత్తరకాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందినవారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు తొమ్మిది మందిని కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు, 16 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

‘ద్రౌపది దండా- 2 శిఖరాగ్రంలో హిమపాతం కారణంగా పర్వతారోహకులు చిక్కుకుపోయారు. జిల్లా యంత్రాంగం, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఐటీబీపీల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని సీఎం ధామీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు సైన్యం సాయం కోరినట్లు తెలిపారు. ఈ విషయమై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సాధ్యమైన ప్రతి సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని