VK Paul: రెండో దశ ఇంకా ముగియలేదు
కరోనా రెండో దశ ఇంకా ముగిసిపోలేదని.. దేశం మొత్తం సురక్షితం అయ్యేవరకు ఏ ఒక్కరు కూడా సురక్షితం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో....
రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
దిల్లీ: కరోనా రెండో దశ ఇంకా ముగిసిపోలేదని.. దేశం మొత్తం సురక్షితం అయ్యేవరకు ఏ ఒక్కరు కూడా సురక్షితం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వీకే పాల్ పాల్గొని మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్ నివారణ చర్యల్ని పాటించాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలను పలు రాష్ట్రాలు సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆయన హెచ్చరించారు. నిబంధనలు విస్మరిస్తే అనర్థాలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే...
* పాజిటివిటీ రేటు అధికంగా (10 శాతం కంటే ఎక్కువ) ఉన్న జిల్లాలను గుర్తించడం.
* బెడ్ ఆక్యుపెన్సీ (ఆక్సిజన్, ఐసీయూ పడకలు), అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను విశ్లేషించండి.
* అధిక కేసులు నమోదయ్యే జిల్లాలు, పాజిటివిటీ లేదా హై బెడ్ ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాల్లో ఇంటెన్సివ్ పర్యవేక్షణ.
* ఒకసారి విధించిన ఆంక్షలను కనీసం 14 రోజుల వరకు అమల్లో ఉంచడం.
* కేసులు అధికంగా నమోదయ్యే జిల్లాలకు ఓ సీనియర్ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించాలి.
* వ్యాధి నియంత్రణ, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన చర్యలు చేపట్టాలి.
* జిల్లా స్థాయిలో కేసుల సమూహాల ఆధారంగా సూక్ష్మ విశ్లేషణ చేపట్టడం.
* చివరగా.. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ వ్యూహాన్ని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపింది. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని సూచించింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కొవిడ్ కొత్త కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. దీంతో ఈ రాష్ట్రాలకు కేంద్రం ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నతస్థాయి బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ బృందాలు తక్షణమే రాష్ట్రాలకు వెళ్లి అక్కడి కొవిడ్ పరిస్థితులు, వైరస్ నిర్వహణ చర్యలను పరిశీలిస్తాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?