జపాన్‌లో భారీ వర్షాలు

జపాన్‌ రాజధాని టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతామీ పట్టణంలో గత మూడు రోజులుగా

Published : 05 Jul 2021 18:43 IST

విరిగిపడ్డ కొండ చరియలు.. 80 మంది గల్లంతు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌ రాజధాని టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతామీ పట్టణంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కొండ చరియలు ఒక్కసారిగా విరిగి, ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో 80 మంది గల్లంతయ్యారు. ఇప్పటికే 3 మృతదేహాలను వెలికితీసిన సహాయక బృందాలు గల్లంతైన మిగతావారిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండచరియలు విరిగిపడి, సుమారు 130 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని