టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో...

Updated : 19 Apr 2021 02:38 IST

టెక్సాస్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఓ షాపింగ్‌ మాల్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌ వద్ద చోటుచేసుకుంది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదు. అతడి కోసం గాలిస్తున్నారు. ఈ  కాల్పులు జరిగిన ప్రాంతంలోని ఇళ్లనుంచి ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని