Jammu kashmir: జమ్మూ- కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని సొపోర్‌లో మంగళవారం భద్రతాదళాలు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్‌ పోలీసులు ధ్రువీకరించారు. మృతుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు..

Published : 24 Aug 2021 15:08 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని సొపోర్‌లో మంగళవారం భద్రతాదళాలు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్‌ పోలీసులు ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ట్విటర్‌ వేదికన వెల్లడించారు. సొపోర్‌లోని పీఠ్‌శీర్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు సోమవారం అర్ధరాత్రి కార్డన్‌ సెర్చ్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో ముష్కరులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. తొలుత ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొద్దిసేపటికి మరొకరిని గుర్తించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురితో కలిపి 24 గంటల వ్యవధిలో 5 మందిని ఎన్‌కౌంటర్‌ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటివరకు కశ్మీర్‌ డివిజన్‌లో 100కు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఐజీపీ విజయ్‌కుమార్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని