Uttarakhand Rains: ఉత్తరాఖండ్లో వర్షబీభత్సం..34మంది మృతి
దేవభూమి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో చోటుచేసుకున్న ఘటనల్లో 34మంది మరణించారని, ఐదుగురు.......
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో చోటుచేసుకున్న ఘటనల్లో ఇప్పటి వరకు 34 మంది మరణించగా.. ఐదుగురు గల్లంతైనట్టు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.1.9లక్షల చొప్పున, మూగ జీవాలను కోల్పోయినవారికి సాధ్యమైనంత మేరకు సాయం చేస్తామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ అశోక్ కుమార్తో కలిసి సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
నైనిటాల్ అతలాకుతలం..
భారీ వర్షాలకు నైనిటాల్ జిల్లా అతలాకుతలమైంది. వరద ఉద్ధృతికి నైనిటాల్ సరస్సు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు వరదనీరు పోటెత్తింది. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రోడ్లపై నిలిచి ఉన్న వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేరకు కొట్టుకుపోయింది.
రిసార్టులో చిక్కుకుపోయిన 100 మంది
ఉత్తరాఖండ్లో గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. వరదల ఉద్ధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక పర్యాటక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. భారీ వరదల కారణంగా కోసి నది ఉప్పొంగడంతో రాంనగర్-రాణిఖేట్ రోడ్లోని ఓ రిసార్ట్లో దాదాపు 100 మంది చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నైనిటాల్లోని మాల్ రోడ్, నైనాదేవి దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి.
రైతులను ఆదుకుంటామన్న సీఎం
రాష్ట్రంలో పరిస్థితులపై విపత్తు నియంత్రణ అధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి సమావేశం నిర్వహించారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, నివేదికలను త్వరగా పంపాలని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్మీ నుంచి మూడు హెలికాప్టర్లను వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు తెలిపారు. చార్ధామ్ యాత్రకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్