Corona: కేరళలో తగ్గని ఉద్ధృతి.. కర్ణాటకలోనూ పెరిగిన కేసులు
కరోనా మహమ్మారి కేరళను కుదిపేస్తోంది. దేశమంతా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా.. కేరళలో మాత్రం భారీ సంఖ్యలో నమోదై నంబర్ 1 హాట్స్పాట్గా .....
తిరువనంతపురం: కరోనా మహమ్మారి కేరళను కుదిపేస్తోంది. దేశమంతా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనబడుతున్నా.. కేరళ మాత్రం భారీ సంఖ్యలో కేసులతో నంబర్ 1 హాట్స్పాట్గా కొనసాగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. దీంతో శని, ఆదివారాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) డైరెక్టర్ ఎస్కే సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందాన్ని కేరళకు పంపిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్లో వెల్లడించారు.
మరోవైపు, గురువారం కొత్తగా 22,064 కేసులు, 128 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,49,365కి చేరగా.. మరణాల సంఖ్య 16,585కి పెరిగింది. 24గంటల్లో అక్కడ 1,63,098 పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. మలప్పురం జిల్లాలో రికార్డు స్థాయిలో 3679 కేసులు రాగా.. త్రిస్సూరు జిల్లాలో 2752, కోలికోడ్లో 2619, ఎర్నాకుళం 2359, పాలక్కడ్ 2034 చొప్పున కొత్త కేసులు వచ్చినట్టు ఆమె వివరించారు.
దేశంలో ప్రస్తుతం 4.03లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో దాదాపు 1.5లక్షల పాజిటివ్ కేసులు (37శాతం) ఒక్క కేరళలోనే ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేరళలో కరోనా కేసుల పెరుగుదలను చూస్తుంటే థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టుగా కనబడుతోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపె వ్యాఖ్యానించడం గమనార్హం. మే నెలలో సెకండ్ వేవ్తో దేశం అల్లాడుతున్న సమయంలో కేరళలో రోజుకు 43వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఆ తర్వాత జూన్ తొలి వారం నాటికి క్రమంగా తగ్గడం ప్రారంభించాయి. అప్పటితో పోలిస్తే తాజాగా దాదాపు రోజుకు 22వేల కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కేరళలో వీక్లీ పాజిటివిటీ రేటు 10.5శాతం నుంచి 14.8శాతం మధ్య కొనసాగుతోంది. గత ఎనిమిది వారాలుగా 10శాతానికి తగ్గకపోవడం గమనార్హం. అలాగే, జూన్ 3నుంచి జూన్ 9 మధ్య కాలంలో రోజువారీ పరీక్షలు సగటున 1.11లక్షల చొప్పున ఉండగా.. జూన్ 22 జులై 28నాటికి ఆ సంఖ్య సగటున 96వేలకు చేరినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, కర్ణాటకలోనూ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 2052 కొత్త కేసులు రాగా.. 35మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే గురువారం దాదాపు 500 కేసులు పెరగడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29,01,247కి చేరగా.. మరణాల సంఖ్య 36,491కి పెరిగింది. ప్రస్తుతం 36,491 క్రియాశీల కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్