Video: షాకింగ్‌.. ముంబయిలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

మహారాష్ట్రలోని ముంబయి (Mumbai) నగరంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బొరివలిలోని......

Updated : 19 Aug 2022 15:46 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి (Mumbai) నగరంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బొరివలిలోని సాయిబాబా నగర్‌లో నాలుగంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం నేలకూలిపోతున్న సమయంలో శబ్దాలు రావడంతో స్థానికులంతా భయంతో పరుగులు పెట్టారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఇది శిథిలమైన భవనం కావడంతో ఇప్పటికే ఖాళీగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన భవనం అయినా అకస్మాత్తుగా కూలిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ భవనం శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని పరిశీలిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఘటనా స్థలంలో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, రెండు రెస్క్యూ వ్యాన్‌లు, మూడు అంబులెన్స్‌లను మోహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు