Terrorists: భోపాల్‌లో నలుగురు ఉగ్రవాదుల పట్టివేత

మరో ఉగ్ర కుట్ర భగ్నమైంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాల్లో నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు......

Published : 14 Mar 2022 01:57 IST

భోపాల్‌: మరో ఉగ్ర కుట్ర భగ్నమైంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాల్లో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో జరిగిన బోద్‌ గయా బాంబు దాడులకు కారణమైన జమాత్‌-ఉల్‌-ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా వీరిని గుర్తించినట్లు మంత్రి తెలిపారు.

అరెస్టు చేసినవారిని ఫజల్‌ అలీ (32), మహమ్మద్‌ ఇక్బాల్‌ (24), జహూరుద్దీన్‌ (28), అక్రమ్‌ అల్‌ హసన్‌గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వారి గదుల్లో ల్యాప్‌ట్యాప్‌లు, పేలుడు పదార్థాలు, మత గ్రంథాలు లభించినట్లు పేర్కొన్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులు తీసుకున్న ఓ గది స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉంటడం గమనార్హం. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు