JKలో హైస్పీడ్‌ 4జీ ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణ!

జమ్మూకశ్మీర్‌లో 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.....

Updated : 05 Feb 2021 21:01 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18 నెలల తర్వాత వాటిని పునరుద్ధరించనుంది. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా 4జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు విద్యుత్‌, సమాచార శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రోహిత్‌ కన్సాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకముందు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు.. ముగ్గురు మాజీ సీఎంలను సుదీర్ఘ కాలంగా నిర్బంధంలో ఉంచింది. అలాగే, ఇంటర్నెట్‌ సేవలపైనా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని